రాబోయే రెండు దశాబ్దాల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మంచి భవిష్యత్తు ఉంది. హెల్త్కేర్ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అవకాశం ఉంది. డీకార్బనైజేషన్, డిజిటలైజేషన్, డీసెంట్రలైజేషన్.. ఈ మూడు ‘డి’లదే భవిష్యత్ అంతా అన్నారు మంత్రి కేటీఆర్.
హైదరారబాద్ హైచ్ఐసీసీలో నిర్వహించిన ‘బ్రాండ్ హైదరాబాద్ ఫ్యూచర్ రెడీ’ సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులు రెట్టింపయ్యాయని పేర్కొన్నారు. ఐదు ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు హైదరాబాద్ను తమ రెండో చిరునామాగా ప్రకటించాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ హబ్గా మారుతోంది.
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లోనూ రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలబెడతాం. అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్ క్యాబిన్ హైదరాబాద్లోనే తయారైంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనూ తెలంగాణ ముందువరుసలో ఉంది. జిల్లాల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ సత్తా చాటిందిన్నారు.