జమ్ముకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లోని హెచ్ఎంటి ప్రాంతానికి సమీపంలో గురువారం పెట్రోలింగ్ సైనిక బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు. ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపి ఆయుధాలతో పరారయ్యారు.
ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్తాన్, ఒకరు స్థానికుడు ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రవాదుల కోసం చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల నాగ్రోటా సమీపంలోని జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతాదళాలతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు జైషే మొహ్మద్ ఉగ్రవాదులు మృతి చెందిన విషయం విధితమే. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే పోలీసులపై దాడి జరగడం గమనార్హం.
Spread the love